Telangana

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : నీలం మధు ముదిరాజ్

కార్యకర్తలే పార్టీకి బలం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పటాన్ చెరు లో సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

కార్యకర్తలే పార్టీ కి బలమని ,కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ చేయడమే సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.బుధవారం పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్వహించిన సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అశోక్ నగర్ లోని సితార హోటల్ లో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.సంగారెడ్డి జిల్లాకు సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ పీసీసీ అబ్జర్వర్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా వచ్చిన దీపక్‌ రాథోర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు . డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పదాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి కార్యకర్తకు గౌరవం, ప్రతి నాయకుడికి బాధ్యత, ప్రతి స్థాయిలో సమన్వయం ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ముందుండాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చేయాలని కోరారు.

సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ ద్వారా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ నాయకులు, బ్లాక్‌, మండల అధ్యక్షులు, సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడం పార్టీ భవిష్యత్‌ సంస్థాగత నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకత్వం–కార్యకర్తల మధ్య సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్‌లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘటితమైన కాంగ్రెస్‌ ,ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్‌గా పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago