Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం.. నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్ గారి ఆధ్వర్యంలో మత్స్య సంఘం భవన ప్రారంభోత్సవం తో పాటు సత్యనారాయణ వ్రతం, కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకానికి చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని, మత్స్యకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శివ కేశవులని పూజిస్తూ ఏర్పాటు చేసిన వన బోజనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన బోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనషుల మధ్య స్నేహభావం పెంపొదిస్తుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ముందుకు కదిలితేనే సమాజంలో మన జాతికి గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్,కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య, మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, గారెల మల్లేష్, మాణిక్యరావ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్,అశోక్,గణేష్,వీరేష్, పూజరి రాజు, సాయి,శ్రీశైలం,రఘు, మహిళలు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago