Telangana

సిగాచి బాధితులకు ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ ప్రయోజనాలు వెంటనే అందించాలి – టి పి జే ఏ సి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం జరిగి 13 నెలలు గడిచినా, పలువురు బాధిత కుటుంబాలకు ఇంకా ఈపీఎఫ్ , ఈఎస్ఐ ప్రయోజనాలు అందలేదని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది.ఈ నేపథ్యంలో టి పి జే ఏ సి జిల్లా ప్రతినిధులు పటాన్‌చెరు ఈఎస్ఐసి కార్యాలయాలను సందర్శించి, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న 13 మంది బాధితుల జాబితాను ఈపీఎఫ్ ఓ అధికారులకు, ఈఎస్ఐ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న 25 మంది బాధితుల జాబితాను ఈఎస్ఐసి అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా టి పి జే ఏ సి సంగారెడ్డి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్ మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ కుమార్ చౌదరి విషయంలో కంపెనీ పూర్తి బాధ్యత వహించి, ఆయనకు మెరుగైన వైద్య చికిత్సను అందించడంతో పాటు, నష్టపరిహారంగా రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రమాద బాధిత కుటుంబాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, ఈడి ఎల్ ఐ , ఈఎస్ఐ క్లెయిమ్‌లను అత్యవసరంగా పరిష్కరించి, అర్హులైన బాధితులకు చట్టబద్ధంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాలని టి పి జే ఏ సి కోరింది.ఈ కార్యక్రమంలో శ్రీధర్ మహేంద్ర – కో-ఆర్డినేటర్, ఆర్. లక్ష్మి – కో-కన్వీనర్ ,ఏ. మానస – కో-కన్వీనర్ పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago