Telangana

మార్పును అందిపుచ్చుకోండి

వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులకు ప్రొఫెసర్ కరుణాకర్ సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ 5.0 దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్ అపారమైన మార్పులకు గురైందని, ఆ మార్పును అందిపుచ్చుకుని విజయ తీరాలను చేరుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) సెంటర్ ఫర్ కేస్ స్టడీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు. జీఎస్బీలోని మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యాపార వృద్ధి కోసం సామాజిక-వాణిజ్యంలో కత్రిమ మేధస్సును ప్రభావంతంగా వినియోగించడం’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ)ని గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ సహా ఆటోమేషన్, రోబోటిక్స్ సాంప్రదాయ వ్యాపార నమూనాలను సమూలంగా మారుస్తున్నాయన్నారు. ఆయా అంశాలపై మంచి అవగాహన కల్సించేందుకు ఏర్పాటుచేసిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులు, మార్కెటర్లు, మేనేజర్లు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, అనధికారిక రంగాలలో పనిచేస్తున్న వారితో సహా విభిన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ యాజమాన్య వికాస కార్యక్రమాన్ని రూపొందించారు. ఏఐ వారి సామాజిక-వాణిజ్య వ్యూహాలను ఎలా విప్లవాత్మకంగా మార్చగలదో, సంబంధిత సంస్థలలో స్థిరమైన వృద్ధిని వారు ఎలా సాధించగలరో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. వ్యాపార కార్యకలాపాలను వృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనున్నది. ఇందులో పాల్గొన్న వారికి ఆయా అంశాలపై విస్తృత అవగాహన ఏర్పరచడమే గాక, ఇతర సంస్థల ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తోంది.ఈ ప్రారంభోత్సవంలో ఎండీపీ నిర్వాహకుడు ప్రొఫెసర్ యు.దేవీప్రసాద్, మార్కెటింగ్ చైర్ డాక్టర్ దేవిక రాణి శర్మ, పలువురు అధ్యాపకులు, దాదాపు 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago