_భారీవర్షాలతో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం
మనవార్తలు ,రామచంద్రపురం :
భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు ,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఆయా కాలనీలు నీటిలో మునిగాయి .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఆరవ బ్లాక్ లో ఇళ్ళ ముందు మురికి నీరు పొంగి ప్రవహిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు బీఎస్పీ మద్దతు కోరడంతో అక్కడికి వెళ్ళి స్థానికులతో మాట్లాడి వారి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. బీహెచ్ఈఎల్ ఎంఏసీ సొసైటీ నుంచి ఈఎస్ఐ రామచంద్రాపురం వెళ్ళే దారి, బీహెచ్ఈఎల్ రైల్వే స్టేషన్ వద్ద చెత్త డంప్ యార్డ్ లాగా మారిపోయిందని బీఎస్సీపి పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ సుంకు వినయ్ కుమార్ విమర్శించారు.
ఈ విషయంపై పలు మార్లు స్థానిక కార్పోరేటర్ దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కారం కాలేదని విమర్శించారు. స్థానిక ప్రజలు బీఎస్పీ మద్దతు కోరడంతో బీఎస్పీ నేతలు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. రామచంద్రాపురంలోని సమస్యలను రేపు రామచంద్రపురం జిహెచ్ఎంసి కమిషనర్ , జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారించాలని కోరుతామన్నారు . ఈ కార్యక్రమం లొ బీఎస్సీపి పటాన్చెరు నియోజకవర్గం ఇంచార్జి సంజీవ , 111 డివిజన్ ప్రెసిడెంట్ పడమటి శ్రీశైలం , హెచ్ఐజి సెక్టార్ ప్రెసిడెంట్ శాంసన్ ,రామచంద్రపురం సెక్టార్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…