Telangana

పర్యావరణ అనుకూల గణేశ పోటీ

– మట్టి గణపతులను తయారుచేసి పర్యావరణ పరిరక్షణను చాటిచెప్పిన పాఠశాల విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

చిట్టి బుర్రలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, చిన్నారి చేతులు మట్టి గణపయ్యలను రూపొందించాయి. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ రుద్రారం ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎఎస్) విద్యార్థులు బుధవారం. ముట్టి గణపయ్యలను రూపొందించారు.హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష పర్యవేక్షణలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ టీలీ పాత్రుడు, పర్యావరణ పాఠ్యాంశ బోధకులు డాక్టర్ ఆర్.ఉమాదేవి నేతృత్వంలో పలువురు బీఎస్సీ, ఈడబ్ల్యూబీ విద్యార్థులు పాఠశాల బాలబాలికలకు మట్టి గణపయ్యల రూపకల్పన పోటీలను పెట్టారు. దానికి అవసరమైన సానుగ్రినంతా సనుకూర్చి బాలల చిట్టి మెదళ్ళకు పదునుపెట్టి, వారిలో నిబిడీకృతంగా ఉన్న స్ప జనాత్మకతను వెలికితీశారు, బాలల్లో పర్యావరణ అవగాహన, సుస్థిరతను పెంపొందించడం ఈ పోటీ లక్ష్యం.ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ అనుకూలత అనే ఇతివృత్తంతో విద్యార్థులు స్థిరమైన వస్తువులతో వినాయక విగ్రహాలను రూపొందించి తను సృజనాత్మకతన, నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం, దాని ప్రాముఖ్యత. గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడింది.చిన్నారులు రూపొందించిన విగ్రహాలను నిశితంగా పరిశీలించిన తరువాత విజేతలను ప్రకటించారు. విశిష్ట సృజనకు గాను వీరేందర్, దుర్గాప్రసాద్ కు ప్రథమ బహుమతి లభించింది. ద్వితీయ బహుమతిని మధుప్రియ, వెస్ట్లోని, నాగశ్రీ, దివ్యల బృందం గెలుచుకోగా, శ్రీమణి, వి.వెస్ట్లని జట్టు తృతీయ బహుమతిని దక్కించుకుంది. భార్గవ్, రాజ్కుమార్లు అసాధారణ ప్రతిభను చూసి ప్రత్యేక బహుమతులతో గుర్తింపు పొందారు. ఈ పోటీలలో పాల్గొన్న మిగిలిని విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి ఉత్సాహపరిచారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago