మనవార్తలు ,పటాన్ చెరు:
క్యాన్సర్ చికిత్స కోసం కొత్త హెబ్రీడ్ నానోమెటీరియల్ను అభివృద్ధి చేసి , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రామస్వామి సందీప్ పేరాలను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
ఈ పరిశోధనలో , భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) తో కలిసి సందీప్ క్యాన్సర్ చికిత్స కోసం నూతన హెబ్రీడ్ నానోమెటీరియల్ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు . దీనితో హెప్టర్ థెర్మియా లేదా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం . శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి విజయవంతంగా ఉపయోగించవచ్చని రుజువు చేశారు .
అంతేగాక , ఈ నానోమెటీరియల్ ద్వారా నకిలీ కరెన్సీని గుర్తించడంతో పాటు నీటివనరులలో హానికరమైన రసాయనాలను కూడా గుర్తించవచ్చని తెలియజేశారు . తద్వారా పర్యావరణానికి కూడా మేలు చేకూర్చేలా ఈ పరిశోధనా ఫలాలను వినియోగించవచ్చన్నారు . సందీప్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…