SINDHU ADARSH REDDY
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వద్దంటూ భారతి నగర్ కార్పొరేటర్ ఆదర్శ రెడ్డి అన్నారు. కాలనీలో అపరిశుభ్రమైన నెలకొనడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో కార్మికులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు .భారతి నగర్ కార్పొరేటర్వెన్నవరం సింధు ఆదర్శ్రెడ్డి LIG లోని వార్డ్ ఆఫీస్ లో GHMC, AMOH రంజిత్ సింగ్,శానిటేషన్ సిబ్బంది తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పారిశుద్ద్య నిర్వహణపై సిబ్బంది కి పలు సూచనలు చేశారు. పారిశుద్ద్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్ట చేశారు. అధికారులు సిబ్బంది జవాబుదారితనంతో పని చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోఉండాలన్నారు. కొన్ని SFA విధి నిర్వహణ లో ఫిర్యాదులు అందడం తో వారిని మార్చాలని సూచించారు . విధి నిర్వాహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నిత్యం రోడ్లను కచ్చితంగా శుభ్రం చేసే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పని చేయని వారిని పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రగతి జులై మొదటి వారం లో మొదలవుతుండడం తో కాలనీ లో వచ్చిన ఫిర్యాదులతో పరిశుభ్రం చేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు . ఈ కార్యక్రమంలో సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్,జీలాని తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…