_ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రోటోకాల్ హక్కును సైతం ఉల్లంఘిస్తూ ఎలాంటి రాజ్యాంగ పదవులు లేని అధికార పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, దీని మూలంగా రాజకీయ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయని..ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను ఆయన డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అధికారిక కార్యక్రమాల పర్యటనలో పోలీస్ ఎస్కార్ట్ ను తొలగించడం అధికార పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి.. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ కు విరుద్ధంగా పాల్గొనడం ,తదితర చర్యల మూలంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు.వెంటనే పై అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…