Telangana

పటాన్చెరులో ఘనంగా జిల్లా స్థాయి 67వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం

_విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ను స్వీకరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని 7 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంతో వివిధ మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

వివిధ క్రీడ అంశాల్లో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశనుండే క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రుల సైతం సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అమూల్య, సీఐ లాలూ నాయక్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

32 minutes ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

36 minutes ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

22 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

24 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago