Categories: politics

గ్రామపంచాయతీలకు, డివిజన్లకు, మున్సిపాలిటీలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

_గ్రామీణ స్థాయిలో క్రీడా రంగానికి సంపూర్ణ సహకారం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని, ఇందుకు అనుగుణంగా క్రీడాకారుల కోసం 38వేల రూపాయలతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 122 తెలంగాణ క్రీడా రంగనాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాల ద్వారా విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాలని విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడానంగం అభివృద్ధి కోసం ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago