జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న చెత్త సేకరణ సిబ్బందికి మంగళవారం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం నూతన చెత్త సేకరణ ఆటోలను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ చెత్త సేకరణ సమయంలో చేతులకు గ్లోవ్స్, మాస్కు, షూస్ ధరించాలని సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని సూచించారు. జిహెచ్ఎంసి పరిధి లోని మూడు డివిజన్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలు కేటాయించడంతో పాటు సిబ్బంది సంఖ్యను సైతం పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రమోద్ గౌడ్, పృథ్వి రాజ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…