Telangana

త్వరితగతిన అభివృద్ధి పనులను చేపట్టాలి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

– జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్ లలో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను సూచించారు. గురువారం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ లలో టెండర్లు పూర్తయిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే, అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా, పనులు చేయించాలని తెలిపారు. డివిజన్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను తొందరగా చేపట్టాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీనగర్, రామచంద్రాపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్, డిప్యూటీ కమిషనర్ సురేష్, సంబంధిత శాఖల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago