Telangana

ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

_సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సుసాధ్యం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రాత్రి జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల కాలంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను బ్రోచర్ రూపంలో విడుదల చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

ఒకనాడు కాలుష్యానికి చిరునామాగా పేరొందిన పటాన్చెరు నేడు అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని అన్నారు.ప్రజలు అందిస్తున్న ప్రోత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డివిజన్ల అభివృద్ధికి అనునిత్యం అహర్నిశలు కృషి చేస్తున్న కార్పోరేటర్లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago