AMEENPUR.jpg
సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 కాలనీల ప్రజలకు మెరుగైన రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలో వెలుస్తున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…