Telangana

కెసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలో పడ్డాయి: బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )

తెలంగాణ సెంటిమెంటుతో బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని, తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని, గుంటనక్క గా మారి తెలంగాణలో స్మశానంగా మారుస్తున్నాడని ఓబీసీ మోర్చ జాతీయ అద్యక్షలు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ముత్తంగిలో మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఓబీసీ జిల్లా స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికే రోజు త్వరలోనే ఉందన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

నేడు ప్రపంచం మోడీ వైపు చూస్తోందని కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశ ప్రజలను అధోగతి పాలు చేయడానికి నడుంబిగించాడన్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని, భాజపా కార్యకర్తలు మునుగోడు విజయం కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నారన్నారు. ఓబీసీల సంక్షేమం కోసం తాము అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని, కెసిఆర్ రాక్షస ప్రభుత్వం జిల్లాలో గొల్ల, కుర్మలకి అన్యాయం చేస్తే తాము దీటుగా ఎదుర్కొన్నామని . మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి లక్ష్మణ్ ఓబీసీ సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన లక్ష్మణ్ పార్టీలో నూతనోత్సాహం నింపారని జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, మాజీ శాసనసభ్యులు నందిశ్వర్ గౌడ్, బాబు మోహన్, యువ మోర్చా రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజి రెడ్డి,జిల్లా ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్ల మహేష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, పార్టీ నేతలు జయశ్రీ, నందనం దివాకర్, విఠల్, దేశ్ పాండే, చంద్రశేఖర్, జగన్, మహేందర్, రామకృష్ణ, జగన్నాథ్, హన్మంత్, ఈశ్వరయ్య, నర్సింగ్, సురెందర్, సుధిర్, దేవెందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

6 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago