మునిపల్లి
యాసంగి పంటసాగులో పంట మార్పు చేపట్టాలని రాయికోడ్ ఎడిఏ హరిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో మునిపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట సాగు చేయకుండా పలు రకాల పంటలు పండించలన్నారు. నీటి ఆధారిత పంటలను పండించేందుకు ఆసక్తి కనబరిచి పప్పు దినుసులు, నూనె గింజలు తదితర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటలను సాగు చేయడం వలన మిశ్రమ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో శివకుమార్,ఏఈఓ సంగీత,సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ సలవోదిన్ , టిఆర్ఎస్ నాయకులు గారిబోధిన్ తదితరులు ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశ వ్యాప్త పల్స్…
ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…
పటాన్చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…