Telangana

ప్రకృతి ఒడిలో సృజనకు పదును

దుర్గం చెరువు వద్ద చార్ కోల్ కార్యశాల నిర్వహించిన గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశాంతమైన ప్రకృతిలో మనస్సు ప్రశాంతంగా ఉండడమే గాక అటు భావుకతతో పాటు ఇటు సృజనాత్మకత పెల్లుబకడం సహజం. ఆ నేపథ్యాన్ని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తనకు అనుకూలంగా మలచుకుంటూ, దుర్గం చెరువు సమీపంలోని పచ్చని అందాలు, చల్లని మలయమారుతాల మధ్య ‘బ్లాంక్ కాన్వాస్ నుంచి మాస్టర్ పీస్ వరకు’ అనే ఇతివృత్తంతో ఒక కార్యశాల నిర్వహించింది. ఇందులో బాలల నుంచి వయోజనుల వరకు, అన్ని వయస్సుల వారు పాల్గొని, తమ సృజనాత్మకతకు పదును పెట్టారు.ఈ కార్యశాల ఉల్లాసభరితమైన, సృజనాత్మక వాతావరణంలో సాగింది. పెయింగ్ వేయడాన్ని నేర్చుకోవడం ఆరంభించిన వారి నుంచి అనుభవజ్జులైన కళాకారుల వరకు అందరూ తరలివచ్చి, చార్ కోల్ డ్రాయింగ్ పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు. వారి ఉత్సాహం, ప్రతిభ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది. గీతం అధ్యాపకుల నుంచి వారికి తగిన మార్గదర్శనం లభించడమే గాక, వారి కళాత్మక ప్రతిభను అన్వేషించడంలో సహాయపడింది.ఈ కళాత్మక సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యశాలలు మున్ముందు మరిన్ని జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని వారు విజ్జప్తి చేశారు.

admin

Recent Posts

దేవాలయ భూమిని కాపాడండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…

2 hours ago

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

17 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

17 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

17 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

17 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

17 hours ago