దుర్గం చెరువు వద్ద చార్ కోల్ కార్యశాల నిర్వహించిన గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రశాంతమైన ప్రకృతిలో మనస్సు ప్రశాంతంగా ఉండడమే గాక అటు భావుకతతో పాటు ఇటు సృజనాత్మకత పెల్లుబకడం సహజం. ఆ నేపథ్యాన్ని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తనకు అనుకూలంగా మలచుకుంటూ, దుర్గం చెరువు సమీపంలోని పచ్చని అందాలు, చల్లని మలయమారుతాల మధ్య ‘బ్లాంక్ కాన్వాస్ నుంచి మాస్టర్ పీస్ వరకు’ అనే ఇతివృత్తంతో ఒక కార్యశాల నిర్వహించింది. ఇందులో బాలల నుంచి వయోజనుల వరకు, అన్ని వయస్సుల వారు పాల్గొని, తమ సృజనాత్మకతకు పదును పెట్టారు.ఈ కార్యశాల ఉల్లాసభరితమైన, సృజనాత్మక వాతావరణంలో సాగింది. పెయింగ్ వేయడాన్ని నేర్చుకోవడం ఆరంభించిన వారి నుంచి అనుభవజ్జులైన కళాకారుల వరకు అందరూ తరలివచ్చి, చార్ కోల్ డ్రాయింగ్ పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు. వారి ఉత్సాహం, ప్రతిభ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది. గీతం అధ్యాపకుల నుంచి వారికి తగిన మార్గదర్శనం లభించడమే గాక, వారి కళాత్మక ప్రతిభను అన్వేషించడంలో సహాయపడింది.ఈ కళాత్మక సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యశాలలు మున్ముందు మరిన్ని జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని వారు విజ్జప్తి చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…