మనవార్తలు ,పటాన్ చెరు:
రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చే నెల 6, 7 తేదీలలో పటాన్చెరువు పట్టణంలో నియోజకవర్గస్థాయి మహిళల క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్రీడా పోటీలు నిర్వహించనున్న మైత్రి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు, మహిళా ప్రజాప్రతినిధులు కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 8వ తేదీన జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భారీ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ సతీమణి మెట్టు రమాదేవి కుమార్ యాదవ్, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎంఈఓ రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…