గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు బి.ఫార్మ్ చివరి ఏడాది విద్యార్థుల కోసం ‘ఫార్మాఎక్స్ ప్లోర్-2026: అధునాతన ఔషధ పరిశోధన అంతరంగం’ అనే నాలుగు రోజుల ప్రయోగశాల సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.అత్యాధునిక పరిశోధనా సదుపాయాలు, వర్ధమాన ఔషధ అభివృద్ధి సాంకేతికతలను ఔత్సాహిక ఫార్మసిస్టులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక విశిష్ట వేదికను కల్పించింది. ఇందులో పాల్గొంటున్నవారు అధ్యాపకులు, పరిశోధకులతో చురుకుగా సంభాషిస్తూ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో విస్తృతంగా ఉపయోగించే ఆధునిక పరికరాలు, వినూత్న పరిశోధన సాధనాలతో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు.
సమగ్ర అభ్యాస అనుభవంలో భాగంగా, విద్యార్థులను మార్గదర్శక ప్రయోగశాల పర్యటలకు తీసుకెళ్లి, అత్యాధునిక విశ్లేషణాత్మక పరికరాలను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తున్నారు. మోల్ సాఫ్ట్ సాధనాలను ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ పై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలలో త్రీడీ ప్రింటింగ్ అనువర్తనంపై ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్న కీలక సాంకేతికతలలో హై-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్పీఎల్సీ), ప్రిపరేటివ్ హెచ్పీఎల్సీ, హై-ప్రెజర్ హోమోజనైజర్స్ (హెచ్.పీ.హెచ్), రియోమీటర్ల వంటి అధునాతన ఫార్ములేషన్ అభివృద్ధి పరికరాలతో పాటు, ఇతర అత్యాధునిక ఔషధ విశ్లేషణ పరికరాలున్నాయి.
ఈ కార్యక్రమం అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలు, ఫార్ములేషన్ అభివృద్ధి, ఔషధ ఉత్పత్తులు ప్రయోగశాల స్థాయి పరిశోధన నుంచి పారిశ్రామిక తయారీకి మారే కీలక పరివర్తనపై లోతైన అవగాహనను కల్పిస్తోంది. ఔషధ ఉత్పత్తుల భద్రత, సమర్థతను నిర్ధారించడంలో కీలకమైన అంశాలైన ప్రక్రియ ఆప్టిమైజేషన్, నాణ్యత హామీ, నియంత్రణ నిబంధనలు అమలుపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ పర్యవేక్షణలో, అధ్యాపక బృంద సహకారంతో డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ పూజా మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా సమన్వయం చేస్తున్నారు. ఇది గురువారం వరకు కొనసాగనుంది.అనుభవపూర్వక అభ్యాసం పట్ల గీతం యొక్క నిబద్ధతకు, విద్యా పరిజ్జానానికి, పరిశ్రమ ఆధారిత ఔషధ పరిశోధనలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ కార్యక్రమం ఓ నిదర్శనంగా నిలుస్తోంది.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…