politics

సీఎం కేసీఆర్ ది కపట నాటకం – పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు:

ముఖ్యమంత్రి కేసీఆర్ ది కపట నాటకమని పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయంలో గడీల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహా ధర్నా ఓక నాటకమని, అందులో కేసీఆర్‌ మహానటుడని విమర్శించారు.

రైతులపై కేసీఆర్‌ కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న వడ్లు కొనకుండా తరువాత వాటిపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓక అవకాశ వాది అని, ఇన్నాళ్ళు ఫాం హౌస్ లో ఉండి ఇప్పుడు బీజేపీ పట్ల పెరుగుతున్న జనం స్పందన చూసి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తోచక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

ఇలా ధర్నాలు చేయాలనుకుంటే టీఆర్ఎస్ నాయకులు చేతనైతే ఈ ఏడున్నర ఏళ్ళుగా కేసీఆర్ హామిలిచ్చిన దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూం, దళిత బంధు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇలాంటి వందలాది స్కీములపై చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసినా ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, నాయకులు దేవేందర్ గౌడ్, శివా, సాయి తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago