Telangana

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన మహోన్నత నాయకులు సీఎం కేసీఆర్

_నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగ

_లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం

_కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అగ్గిపెట్ట లాంటి అద్దె ఇల్లు… చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్న నిరుపేద ప్రజలకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో 50 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి అందజేస్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులతో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం లాటరీ పద్ధతిన బ్లాక్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇళ్ల పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు పేర్కొన్నారు.పటాన్చెరుకు సంబంధించిన లబ్ధిదారులందరిని పటాన్చెరు క్యాంపు కార్యాలయం నుండి బస్సులు ఏర్పాటు చేసి కొల్లూరు కి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago