_నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగ
_లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం
_కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అగ్గిపెట్ట లాంటి అద్దె ఇల్లు… చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్న నిరుపేద ప్రజలకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో 50 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి అందజేస్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులతో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం లాటరీ పద్ధతిన బ్లాక్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇళ్ల పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు పేర్కొన్నారు.పటాన్చెరుకు సంబంధించిన లబ్ధిదారులందరిని పటాన్చెరు క్యాంపు కార్యాలయం నుండి బస్సులు ఏర్పాటు చేసి కొల్లూరు కి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…