Telangana

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన మహోన్నత నాయకులు సీఎం కేసీఆర్

_నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగ

_లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం

_కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అగ్గిపెట్ట లాంటి అద్దె ఇల్లు… చాలీచాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్న నిరుపేద ప్రజలకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో 50 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి అందజేస్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులతో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అత్యంత ఆధునిక సాఫ్ట్వేర్ సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.రెండో విడతలో ఎంపికైన 500 మంది లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం లాటరీ పద్ధతిన బ్లాక్ లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇళ్ల పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు పేర్కొన్నారు.పటాన్చెరుకు సంబంధించిన లబ్ధిదారులందరిని పటాన్చెరు క్యాంపు కార్యాలయం నుండి బస్సులు ఏర్పాటు చేసి కొల్లూరు కి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago