Telangana

వాతవరణ మార్పు ఎన్నికల ప్రచారాంశం కావాలి

_గీతం అతిథ్య ఉసన్యాసంలో అభిలషించిన ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ డి.పార్థసారథి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయని, అది ఎన్నికల ప్రచారాంశం కావాలని ఐఐటీ బొంబాయిలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ప్రొఫెసర్ డి.పార్థసారథి అభిలషించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు, ప్రజా సమూహాలు, ఎన్నికలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను, కష్టాలను ఎన్నికల సమస్యగా సాధారణ ప్రజలు ఎందుకు లేవనెత్తడం లేదో అర్థం చేసుకోవడానికి ఈ చర్చ కొనసాగించారు.యువతలో వాతావరణంపై అవగాహనను పెంచే సందర్భంలో వాతావరణ న్యాయం యొక్క అర్థం, ఆవశ్యకతపై డాక్టర్ పార్థసారథి అవగాహన కల్పించారు.

ప్రపంచ సహకారం, ప్రాంతీయ ఒప్పందాలు, స్థానిక క్రియాశీలతను ప్రోత్సహించడంపై దృష్టి సారించే కొత్త విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నిపుణుల చర్చలు, శాస్త్రీయ చర్చలకు పరిమితమైన రోజువారీ సంభాషణలలో వాతావరణ మార్పులను భాగం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.తొలుత, జీఎస్ఏహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోప్మాన్ జోస్ అతిథిని ఆహ్వానించి, సత్కరించారు. సోషియాలజీ విభాగం సమన్వయకర్త డాక్టర్ అవినాష్ అతిథి స్వాగతించగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రోమా భట్టాచార్య నందన సమర్పణ చేశారు.సామాజిక, పర్యావరణ సమస్యలను ఎత్తిచూపి, సానుకూల సూర్పును తీసుకురావడానికి నిపుణులను ఒకచోట చేర్చి, ఆయా అంశాలపై చర్చలను జీఎస్ హెచ్ఎస్ నిర్వహిస్తోంది.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

15 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

17 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago