కిర్బీ పరిశ్రమ
పటాన్ చెరు:
పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు.
సీఐటీయూకు 192. బి ఎం ఎస్ కు 190. టీఆర్ఎస్ కె.వి కి 170 ఓట్లు రాగా. 2 ఓట్ల తో బిఎంఎస్ పై సిఐటియు గెలుపొందింది. ఈ సందర్భంగా కార్మికులు సందడి సందడి చేశారు. బాణసంచా కాల్చి విజయ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీరం మల్లేశం కే రాజయ్య లు మాట్లాడుతూ సిఐటియు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికులు రెండవసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. కార్మికులకు ఎల్లవేళలా అండగా నిలుస్తు కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు అన్నారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా కార్మిక సంక్షేమమే సీఐటీయూ ధ్యేయమని అన్నారు. కార్మికులకు రావలసిన చట్ట పరమైన హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్సింహారెడ్డి. నాగేశ్వరరావు. కిర్బీ పరిశ్రమ జనరల్ సెక్రటరీ వి ఎస్ రాజు. రవీందర్. శ్రీనివాస్ ఇతర కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…