పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 120,121,125 లలోని భూములను ఆయన పరిశీలించారు . అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని రియల్టర్లు ఆక్రమించున్నారని వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న జిల్లా అధికారులకు ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భూ కబ్జాలపై గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు . ప్రజా అవసరాల కోసం ఎంతో విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం మానుకోవాలన్నారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని .రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 126 సర్వే నెంబర్ లో 10 ఏకారాల భూమిలో రెడిమిక్స్ పెట్టి ఆక్రమించుకున్నారని అన్నారు.2013 చట్టం ప్రకారం తప్పని పరిస్థితుల్లో రైతులు ఒప్పుకుంటే అమలు చేయాలని ,బహిరంగ మార్కెట్లో ఏకరకు 5 కోట్ల రూపాయల పలుకుతోంది అని అన్నారు. గ్రామ రైతులకు న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైసాయ్య,శేఖర్,రైతులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…