Telangana

ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శనివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో జరిగిన సదస్సులో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని,వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి, కార్మికుల హక్కులను పూర్తిగా హరించి వేస్తుందని,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలంబిస్తున్నాయన్నారు. కార్మికుల రోజువారి పని దినాన్ని ఎనిమిది గంటల నుండి 12 గంటలకు పెంచుకునేందుకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మికులు తమ స్వేచ్ఛను కోల్పోతారని, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ఆశ, అంగన్వాడి, మున్సిపల్, గ్రామపంచాయతీ, నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులకులు ఉద్యోగ భద్రత కరువైందని వాపోయారు. వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వి బి జి రాంజీ చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చి, ఉపాధి హామీ పథకాన్ని హరించి వేసే విధంగా చేసుందని దీనివలన కార్మికులు తమకు దక్కవలసిన ఉపాధి హామీ పనులను కోల్పోవలసి వస్తుందన్నారు. అందుకోసం కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఆగస్టు 10న జరిగే జైల్ భరోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సతీష్, వీరేష్ చారి, స్వామి, గోపాల్,రవి, శ్రీనివాస్, సంజీవ్, రాము, ఆంజనేయులు, భూపాల్ రెడ్డి, రామచందర్, జయరాం, నవీన్ ఇతరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

14 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

15 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

15 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

19 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago