Telangana

పటాన్ చెరు ఈఎస్ఐ డిస్పెన్సరీని వెంటనే పటాన్ చెరులో ఏర్పాటు చేయాలి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి

ఈఎస్ఐ డిస్పెన్సరీ పటాన్ చెరులో లేకపోవడం తో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు

ఈఎస్ఐ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డా. గౌతమ్ కు సీఐటీయూ ప్రతినిధి బృందం వినతి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

రాష్ట్రంలోని ఈఎస్ఐ బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రస్తుతం రామచంద్రాపురంలో కొనసాగుతున్న పటాన్ చెరు ఈఎస్ఐ డిస్పెన్సరీని వెంటనే పటాన్ చెరు తరలించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈఎస్ఐ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డా. గౌతమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 50 వేల మంది ఈఎస్ఐ బీమాదారులు ఉన్నప్పటికీ, వారికి అందుబాటులో ఉండాల్సిన డిస్పెన్సరీ రామచంద్రాపురంలో కొనసాగడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.రోజువారీగా చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో కార్మికులు సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పటాన్ చెరులోనే ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులు, అన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షం లో కార్మికులను సమీకరించి పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వం ను హెచ్చరించ చారు ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు గంగాధర్, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

14 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

15 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

15 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

19 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

19 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago