Districts

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించాలి _- ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి

మనవార్తలు ,పటాన్‌చెరు:

ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కుదేలైందని ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి గుదిబండగా మారిన పెట్రోల్, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎపిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు శివారులోని ఎపిఆర్ సంస్థ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను తగ్గించకపోతే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఎప్పుడు ఏ విధంగా ధరలు పెరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు గృహ నిర్మాణాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను నియంత్రించాలని తెలిపారు. లేని పక్షంలో ఒకరోజు నిరసన ప్రదర్శనతో ఆగకుండా నెల రోజులైనా పనులు ఆపి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎపిఆర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

12 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

12 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

12 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

12 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

13 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

3 days ago