పటాన్చెరులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

_గొప్ప దార్శనికుడు మంత్రి కేటీఆర్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]

Continue Reading

శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టిన దళిత బంధు

_హే గాంధీ ఏంది ఇది _అర్హులను కాదని అనుచరులకే పట్టం _ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కుమ్మక్కై దోచిపెట్టిన వైనం ,సహకరించిన అధికారులు మనవార్తలు , శేరిలింగంపల్లి : దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రజా ప్రతినిధులు అర్హులను కాదని తమ అనుచరులకు కట్టబెట్టి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు పథకం పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు […]

Continue Reading

బోనమెత్తిన కసిరెడ్డి సింధు రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ నడిగడ్డ తాండ లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బోనాల ఉత్సవాలు నడిగడ్డ తండ, మియాపూర్ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ […]

Continue Reading

అమీన్ పూర్ మున్సిపల్ అధికారులతో అదనపు కలెక్టర్ రాజర్షిషా సమీక్ష

మనవార్తలు , అమీన్ పూర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమీన్ పూర్, బొల్లారం లు సంబంధించిన అధికారులతో వర్షాల స్థితిగతులపై ఆరా తీశారు. చెరువులు, కుంటలు పొంగే చోట అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, మట్టిగోడల ఇళ్ల ను గుర్తించి వాటిలో నివసిస్తున్న వారిని సురక్షితప్రాంతాలకు […]

Continue Reading

ఘనంగా సుబ్రమణ్యస్వామి జయంతి ఉత్సవాలు

మనవార్తలు , రామచంద్రపురం: బి హెచ్ ఈఎల్ దేవాలయంలో ఘనంగా సుబ్రమణ్యస్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు సుబ్రమణియమ్ తదితర తదితర వేద పండితుల సమక్షంలో బిహెచ్ఎల్ దేవాలయ యంత్రాంగం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా పాలాభిషేకంతో పాటు పంచామృతాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు సుబ్రమణ్యం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Reading

ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

మనవార్తలు ,హైదరాబాద్: వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో  విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో  విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే […]

Continue Reading

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సందడి

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బోనాల పండుగను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని స్కూల్ సిబ్బంది భావిస్తూ ఆ దిశగా పిల్లల్లో పండుగల ఔనత్యాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లని రాఘవేంద్ర కాలనీ లోని శ్రీనిధి గ్లోబల్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం రోజు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి ఆటపాటలతో విద్యార్థులు,ఉపాధ్యాయులు సందడి చేసారు.ఈ […]

Continue Reading

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోరాటంలో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ కిషన్ రావు ను నందిగామలోని తన నివాసంలో కలిసి సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరువులో ఆసుపత్రి రావడానికి ముఖ్య కారణం 20 గ్రామాల […]

Continue Reading

చిట్కూలులో అంగరంగా వైభవంగా బోనాల సందడి

మనవార్తలు ,పటాన్ చెరు; చిట్కూలు గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నాలుగురోజుపాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారికి ఓడిబియ్యం, తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల అనంతరం భవిష్యత్‌లో జరుగబోయే అంశాలను అమ్మవారి భవిష్యవాణి వినిపించనున్నట్లు తెలిపారు. ఆరోజు సాయంత్రం పలహార బండి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బండిని లాగేందుకు పోటేళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా అమ్మవారికి […]

Continue Reading

పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST […]

Continue Reading