రామచంద్రాపురం
అర్హులైన భూమిలేని నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని బీఎస్పీ పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎస్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఎస్సీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రాపురం, అమీన్ పూర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. పేదలకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని , పోడు భూములకు పట్టాలు కల్పించాలని,అసైన్డ్ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఎమ్మార్వోలకు వినతి ప్రతం సమర్పించారు.
ధరణి పోర్టల్ లో అనుభవదారుడు కాలంను పునరుద్దరించాలని… భూ వివాదాల పరిష్కారానికి శాశ్విత ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జి సంజీవ , పటాన్చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ , ఉపాధ్యక్షులు రాములు , అమీన్పూర్ కన్వీనర్ చెంద్ర శేఖర్ , తెల్లాపూర్ మునిసిపల్ ప్రెసిడెంట్ దర్శన్ , జనార్దన్ , శ్రీశైలం , రామకృష్ణ , శాంసన్ ,మధు తదితరులు పాల్గొన్నారు
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…