మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డివిజన్ , గోపనపల్లీ తాండా లో హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో నూతనoగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,రాధాకృష్ణ యాదవ్ల్ లతో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గోపనపల్లి తాండా వాసులకు అందుబాటులో ఉండేలా కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయమన్నారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని కొనియాడారు, ఈ బి.ఆర్.ఎస్ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని , వారి అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్లి అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు, ఈ కార్యక్రమం లో కృష్ణ ముదిరాజ్ ,లక్ష్మి నాయక్, రంగస్వామి,జగదీష్, రమేష్, శ్రీరామ్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, బాబు నాయక్, మహిళా నాయకులు మహేశ్వరి, ఇందిర ,సుజాత తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…