Telangana

అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన బీసీ ఐక్యవేదిక

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి నియోజక వర్గం అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న ధర్నాలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక తమ పూర్తి మద్దతుతో సంఘీభావం తెలిపారు. గత రెండు రోజులుగా మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మద్దతు తెలిపారు. ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏ పోరాటానికైనా బీసీ ఐక్యవేదిక మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ విషయాన్ని సి ఎం దృష్టికీ తీసుకెళ్తామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ న్యాయమైన కోరికల గురించి పోరాటం ఉధృతం చేయడం కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటంలో కూడా రాజకీయ పార్టీలు మరియు అన్ని సంఘాల నాయకులు మద్దతు అందించాలని కోరారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమించటానికి వెనుకాడబొమని తెలిపారు. ఉమ్మడిమెదక్ జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు నర్సింలు ముదిరాజ్ సంఘీభావం తెలుపుతూ పూర్తి మద్దతు ప్రకటించారు. సి ఐ టి యూ కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మియాపూర్ బీసీ అధ్యక్షులు నరసింహ ముదిరాజ్ మద్దతుగా ప్రసంగించారు. అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ ప్రాజెక్టు లీడర్ నాగమణి తమ న్యాయమైన కోరికలు చదివి వినిపించారు. తమతో ప్రభుత్వం వెట్టి చాకిరీ ఛేహించుకొని, నేడు మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ ధర్నా లో అంగన్వాడి టీచర్స్ వర్కర్స్ సుమారుగా 200 మంది పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నాయకులు సరోజనమ్మ, పూజ, ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

4 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

4 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

4 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

16 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

19 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago