Telangana

ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు బస్తీ దవాకనాలు ఏర్పాటు చేశాం_మంత్రి హరీష్ రావు

మనవార్తలు ,అమీన్ పూర్:

ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తిని పోగెట్టుఎందుకు పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు అందుతున్నాయని అన్నారు.నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం సహా బీపీ, షుగర్​తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో బస్తీ దవాఖాన ఎంతో దోహదపడుతుందని మంత్రి హరీష్ రావ్ అన్నారు .57 రకాల రక్త పరీక్షలు చేస్తాం..మెసేజ్ రూపంలో రిపోర్ట్స్ పంపిస్తాం..ఉచితంగా మందులు అందిస్తాం ఆదివారం సైతం పని చేస్తుంది అని ,బీపీ షుగర్ ఉన్న వారికి నెలకు సరిపడా మందులు అందిస్తామని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు .

ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేల చూడాలని ఆశ , ఏ ఎన్ ఎం లను మంత్రి హరీష్ రావు గారు సూచించారు. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.2 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో పటాన్ చెరు ఆస్పత్రిలో సిటి స్కాన్ ఏర్పాటు చేశాం,18 మంది డాక్టర్ల ను ఏర్పాటు చేశాం, ముహూర్తాల పేరుతో సీజరియాన్ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని తెలిపారు .త్వరలో పటాన్ చెరులో 200 పడకలు అత్యాధునిక వసతులు ఆధునిక శస్త్ర చికిత్సలు.దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఉంటాయని ,త్వరలో సీఎం కెసిఆర్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

 

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago