Hyderabad

సమ్మక్క,సారక్కలను అవమానించిన చినజీయర్ స్వామిపై అట్రాసిటీకేసు నమోదు చేయాలి -అఖిల భారత బంజారా సేవసంఘం డిమాండ్

మనవార్తలు శేరిలింగంపల్లి :

ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి ని అరెస్ట్ చేసి అతని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని అఖిల భారత బంజారా సేవ సంఘo రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క-సారక్క లను ఎందుకు ఆరాధిస్తారని వాళ్లు దేవతలు కాదని వాళ్ళు అడవిలో ఒక సామాన్యమైన వారని, అటువంటి వారికి కోట్లాది రూపాయలు ముడుపులు ఎందుకు సమర్పిస్తున్నారని అవహేళన చేస్తూ, కించపరుస్తూ చిన్న జీయర్ స్వామి మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దొంగ డేరా బాబా గా మారి భక్తి ముసుగులో దేవుడే కానీ రామానుజుల వంటి వారి విగ్రహం పెట్టీ వేల కోట్ల రూపాయలు దోపిడీకీ పాల్పడుతున్నాడు. సామాన్యమైన టైపిస్ట్ ఉద్యోగం చేస్తూ అంచలంచలుగా చిన్న జీయర్ అవతారమెత్తి ఒక దొంగ డేరా బాబా గా మారి వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించమని ఏ పురాణాల్లో వ్రాశారో చెప్పాలి.

బ్రాహ్మణ దేవతలే దేవతలని మిగిలిన కింది కులాల దేవతలందరూ దేవతలు కాదని అహంకార, ఆధిపత్య, మనువాదం తో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేవతలలో కూడా బ్రాహ్మణ దేవతలు ఉన్నారని చెప్పి దేవతలలో కూడా ఆధిపత్య దేవతలు అనగారిన కులాల దేవతలు ఉన్నారని వక్రభాష్యం చెప్పడం చిన్న జీయర్ స్వామిలాంటి దొంగ బాబా లకే సాధ్యం. ఆదివాసీ గిరిజన సమాజాల్లో అడవుల్లో నివసిస్తున్న తమ వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అమరులైన వారిని దేవతలుగా కొలిచే సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి వస్తున్నది. అటువంటి ఆదివాసి గిరిజన దేవతలకు అతీత శక్తులు ఉంటాయని కోట్లాది మంది ప్రజల నమ్మకం. వారి నమ్మకాలను కించపరుస్తూ అవహేళన పరచడం చిన్న జీయర్ స్వామి లాంటి దొంగ బాబాలకు చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది.

పురాతన ఋగ్వేదం నుండి వైదిక పురాణ గ్రంథాలన్నిటిలోనూ ఆదివాసి వీరుల పోరాటం, దేవతలుగా కొలిచిన పద్ధతి గురించి చెప్పబడింది. బ్రాహ్మణ దేవతలు ప్రత్యేకంగా ఉన్నారని ఎక్కడ రాయబడ లేదు. పురాణాలను అవపోశన పట్టిన ఈ దొంగ బాబా కు తెలియంది కాదు. కావాలనే కింది కులాల దేవతలను అవమానించడం వలనా బ్రాహ్మణ దేవతలను ఆరాధించే ప్రజలు పెరిగి చిన్న జీయర్ స్వామి లాంటి దొంగ బాబాల ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో మనువాద భావజాలాన్ని తిరిగి ప్రతిష్టించాలని చూస్తున్న సంస్థలకు ఊతం ఇచ్చేదిగా చిన్న జీయర్ స్వామి మాటలు ఉన్నాయన్నారు. సమ్మక్క, సారక్క లను కించపరుస్తూ అవహేళన చేసిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముచింతల వ్యాపార సామ్రాజన్ని ముట్టడిస్తం జాగ్రత్త అన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

7 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

8 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

8 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

8 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago