మనవార్తలు ,అమీన్పూర్:
రాబోయే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడి మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్, క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం, భద్రత సౌకర్యాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మహా జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…