Districts

గణతంత్ర కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి…

– అభినందించిన ప్రో వీసీ , ఇతర ఉన్నతాధికారులు

మనవార్తలు ,పటాన్ చెరు:

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26 న నిర్వహించిన కవాతులో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి అరుణ్ను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ , వివిధ విభాగాధిపతులు మంగళవారం అభినందించారు .

విద్యార్థులు తమ గురించి తాము తెలుసుకోవడానికి , అభివృద్ధి చెందడానికి , వారి నెపుణ్యాలు – జ్ఞానాన్ని వివిధ సందర్భాలలో ఉపయోగించుకోవడానికి ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు సహాయ పడతాయని వారన్నారు . విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించడం ద్వారా లభించే ఇటువంటి అరుదైన అవకాశాలు జీవితంలోనే ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయని వారు అభిప్రాయపడ్డారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగిన నెల రోజుల శిక్షణలో అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . అంతకు మునుపు , గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . అరుణ్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడల్స్ తో పాటు ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు . ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా దినకరన్ సేవలందిస్తున్నారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago