– అభినందించిన ప్రో వీసీ , ఇతర ఉన్నతాధికారులు
మనవార్తలు ,పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26 న నిర్వహించిన కవాతులో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కవాతులో పాల్గొన్న గీతం విద్యార్థి అరుణ్ను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ , వివిధ విభాగాధిపతులు మంగళవారం అభినందించారు .
విద్యార్థులు తమ గురించి తాము తెలుసుకోవడానికి , అభివృద్ధి చెందడానికి , వారి నెపుణ్యాలు – జ్ఞానాన్ని వివిధ సందర్భాలలో ఉపయోగించుకోవడానికి ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు సహాయ పడతాయని వారన్నారు . విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించడం ద్వారా లభించే ఇటువంటి అరుదైన అవకాశాలు జీవితంలోనే ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయని వారు అభిప్రాయపడ్డారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగిన నెల రోజుల శిక్షణలో అరుణ్ దినకరన్ పాల్గొన్నారు . అంతకు మునుపు , గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . అరుణ్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడల్స్ తో పాటు ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు . ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా దినకరన్ సేవలందిస్తున్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…