politics

నేపాల్ వేదికపై గీతం ఖ్యాతి

యువత మార్పిడిలో భాగంగా నేపాల్ ను సందర్శించిన గీతం విద్యార్థి మహిత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శిఖలో మరో కలికితురాయి చేరింది. గీతం విద్యార్థిని మహితా కొండూరు మన దేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా నేపాల్ లో పర్యటించి, అక్కడి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని పొందారు. ఈ విషయాన్ని గీతం ఎన్.సీ.సీ. కేర్ టేకర్ ఆఫీసర్ ఎస్.అజయ్ కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నేపాల్ లో అక్టోబర్ 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఎన్.సీ.సీ. యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (వైఈపీ)లో సీనియర్ అండర్ ఆఫీసర్ మహిత కొండూరి విజయవంతంగా పాల్గొన్నారని, మన దేశం నుంచి మొత్తం 16 మందిని క్యాడెట్ లను ఎంపిక చేయగా, అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి మహిత ఒక్కరే ప్రాతినిధ్యం వహించినట్టు ఆయన వివరించారు.మహిత నేపాల్ లో ఉన్న సమయంలో అనేక కార్యకలాపాలలో పాల్గొనడమే గాక, సాహసోపేతమైన ‘జంగిల్ సఫారీ’లో కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఆమె అంకితభావం, శ్రేష్టమైన ప్రదర్శనలను గుర్తించిన నేపాల్ లోని ఎన్.సీ.సీ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సురేశ్ కుమార్ కర్కి ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని స్వయంగా అందజేశారన్నారు.భారతదేశ సాంస్కృతిక రాయబారిగా మహిత సాధించిన విజయాలు, ఆమె నిర్వహించిన పాత్రను గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, క్రీడలు-ఎన్.సీ.సీ. డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ ఉపాధ్యాయ తదితరులు ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.నేపాల్ లో మహిత అనుభవం ఆమె వ్యక్తిగత అభివృద్ధిని మెరుగుపరచడమే కాకుండా, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన క్యాడెట్ ల మధ్య గొప్ప స్నేహాన్ని, ఆలోచనల మార్పిడిని కూడా ప్రోత్సహించినట్టు తెలిపారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

6 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago