Telangana

హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుక

టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్‌ జూన్ 13న శిల్పాకల వేదిక లో

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో జూన్ 13న, శిల్పకళావేదిక హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుకగా నిలుస్తుందని సింగర్ సునీత అన్నారు .ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు కాన్సర్ట్ ప్రత్యేకతలు, సంగీత కాన్సెప్ట్, ప్రేక్షకులకు అందించబోయే అద్భుతమైన సంగీత అనుభూతి గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణ మరియు ధనుజయ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తరతరాల సంగీతాన్ని ఒకే వేదికపై ప్రేక్షకులకు అందించే ఈ ప్రత్యేక కాన్సర్ట్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “టైమ్‌లెస్” ద్వారా స్వర్ణయుగంలోని చిరస్మరణీయ గీతాలతో పాటు నేటి ప్రేక్షకులు అభిమానించే మెలోడీలను కూడా అందించనున్నట్లు తెలిపారు.కాన్సర్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, అమెరికా మరియు భారతదేశంలో భారీ స్థాయి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేదం ఆర్ట్మ్ సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట”ను తీసుకురావడం గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు సంగీత ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్వరాలలో ఒకరిగా సునీతకు ఉన్న ప్రత్యేక స్థానంతో ఈ అనుబంధం తమకు ఎంతో విశేషమని తెలిపారు.సంగీతం, జ్ఞాపకాలు, భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ కాన్సర్ట్ హైదరాబాద్‌లో అత్యంత గుర్తుండిపోయే సంగీత సాయంత్రాలలో ఒకటిగా నిలవనుంది.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago