చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం…
అమీన్ పూర్:
ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలకు అనుగుణంగా అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.
బుధవారం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలతో నిర్వహించతలపెట్టిన అభివద్ధి కార్యక్రమాలకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హరితహారం పట్టణ ప్రగతి లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.వార్డు కమిటీ సమావేశాల్లో ప్రజల సూచించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి పనులు చేపడుతున్నామని గుర్తు చేశారు.అన్ని వార్డులకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన వార్డు సభ్యులు కోరినట్లుగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గురువారం నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…