పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో, గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు.మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మలన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జాతర నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…