మనవార్తలు , శేరిలింగంపల్లి :
జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, అల్విన్ కాలనీ, లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, రామకృష్ణ తెలిపారు. ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరం నందు బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఎస్ పి ఓ 2 పల్స్, జనరల్ పిజీషియాన్ కంటి పరీక్ష, సంబంధిత సమస్యలకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరం లో రక్తంలో షుగరు, బి.పి, గుండెకు సంబంధించిన ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించి వైద్య శిబిరం నందే గుండె వ్యాధులను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలను ఉచితముగా నిర్వహంచి అవసరమైన వారికి ఉచితముగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరం నందు పేదలకు ఏదైనా వైద్యం కాని తక్షణ వైద్య సహాయం అవసరమైన వారికి అందిస్తామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…