Telangana

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్

తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ వాటర్ పరిశ్రమ ముందు కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ కార్మికులు యూనియన్ పెట్టుకుంటే తొలగించడం చట్టానికి వ్యతిరేకమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులను సైతం యాజమాన్యం భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో యాజమాన్యం కోట్లు గడిస్తు, కార్మికుల భద్రత సంక్షేమం గాలికి వదిలేయడం దారుణమన్నారు.కార్మికులు హక్కులు రక్షణ కోసం కార్మికులు ఏకం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యజమాన్యం దిగివచ్చి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నాగరాజు, కోశాధికారి నవీన్, సిఐటియు నాయకులు రాజు,వెంకటేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

22 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

23 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago