పాఠ్యేతర కార్యలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో
అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులకు సత్కారం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ శనివారం ప్రతిష్టాత్మక ఏస్-2025 అవార్డుల ప్రదానోత్సవాన్ని సగర్వంగా నిర్వహించింది. పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించింది. వారితో పాటు ఉత్తమ సహాయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ సీసీ క్యాడెట్ల అమూల్యమైన సహకారాన్ని కూడా గుర్తించి, వారిని కూడా సముచిత రీతిలో సత్కరించి, ఉత్సాహపరిచింది.బహుళ విభాగాలలోని విద్యార్థుల విభిన్న ప్రతిభ, అత్యుత్తమ ప్రదర్శనలను ప్రశంసిస్తూ మొత్తం 52 అవార్డులను గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ ప్రదానం చేశారు. విద్యతో పాటు సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంలో గీతం నిబద్ధతకు ఈ కార్యక్రమం ఓ నిదర్శనంగా నిలిచింది.గౌరవనీయమైన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులు హాజరైన ఈ ఏస్ అవార్డులు-2025 ప్రదానోత్సవం విద్యార్థులకు ప్రేరణగా నిలవడమే గాక, వర్సిటీ యొక్క అత్యుత్తమ ప్రదర్శన, నాయకత్వ వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…