అమీన్ పూర్ లో ఏ.బీ.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం
మనవార్తలు , అమీన్ పూర్:
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా కు సంబంధించిన కార్యవర్గ సమావేశాన్ని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టులు సమావేశమయ్యారు.
దీనికి అధ్యక్షత వ్యవహరించిన సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లే విధింగా ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ తెలిపారు .రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు .అనంతరం సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .
ఈ సమావేశంలో ఏ బీ జే ఎఫ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కొమ్ముగురీ ప్రదీప్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సునిల్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ సంస్థను జర్నలిస్టుల ఐక్యత తో బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగరెడ్డి జిల్లా సెక్రెటరీ అఖిల్ , హరి ప్రసాద్, రవి , హరి, అనిల్, మనీష్, భారత్, సాయి కిరణ్, రఘు నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…