Telangana

లారీ ప్రమాదంలో మృతి చెందిన పాత్రికేయుడు

_శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల నివాళులు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా, బచ్చన్న పేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య చిన్న కుమారుడు బొడికే శ్రీనివాస్ (45) శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ ప్రస్థానం అనే దినపత్రికలో గత ఆరు ఏడు సంవత్సరాలుగా విలేకరిగా పనిచేస్తున్నాడు. బొడికే శ్రీనివాస్ అనే పాత్రికేయుడు గత రెండు రోజుల క్రితం పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం గ్రామంలో ఓ బార్ట్4 డే పార్టీకి శ్రీనివాస్ భార్య ఇందిరా, ఆయన కుమారుడు నందకుమార్ (8) మరియు ఆయన స్నేహితుడు రమేష్ (34) వాళ్ళ భార్య సంధ్య (28) అతని ముగ్గురు పిల్లలు కలిసి మధ్యాహ్నం వెళ్లి తిరిగి వచ్చి క్రమంలో సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్, రమేష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చుట్టుపక్కల వారు 108 వాహనం లో పటాన్ చెర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి కి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని మృతులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ క్లబ్ తరఫున ఆయన కుటుంబానికి తాము అండగా నిలబడతామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. తోటి పాత్రికేయూన్ని ఇలా ప్రమాదవశాత్తు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఇంతకు ముందు కూడా అనేకమంది పాతికేయ సోదరులు తమ వృత్తిలో భాగంగా వివిధ కారణాలతో చనిపోవడం జరిగిందని, వారందరికీ కూడా తమ సానుభూతిని తెలుపుతున్నట్టు సభ్యులు తెలిపారు. ఈయన కుటుంబాన్నీ ఆదుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ గ్రామమైన నాగిరెడ్డిపల్లి లో అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago