_జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సత్వరమే నిధులు కేటాయించాలని బల్దియ కమిషనర్ లోకేష్ కుమార్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.డివిజన్లో అభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై ఇటీవల రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాదులోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమయ్యారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల నిధులు, కేటాయించడంతోపాటు, పటాన్ చెరు ఫుట్ ఓవర్ బ్రిడ్జి , వరద నీటి కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే త్వరితగతిన పనులు చేపడతామని ఆయన తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…