త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ, స్వార్థాన్ని త్యజించాలన్నదే, బక్రీద్ మనకు ఇచ్చే సందేశం. శాంతి, సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం రోజున బక్రీద్ పండుగ సందర్బంగా పటాన్ చెరు లోనీ ఈద్గాలోని ముస్లిం సహోదరులు ఎంతో భక్తిభావంతో జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా స్థలాలలో పారిశుధ్య పనులను శుభ్రం చేయించారు కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.గత ఏడాది కోవిడ్ కారణంగా బక్రీద్ పండుగను జరుపుకోలేదని ,ఈ సారి కొవిడ్ నిబంధనలతో బక్రీద్ను పండుగను నిర్వహించుకోవాలని ,ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ ,మాస్క్ ధరించాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…