అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న వారికి చికిత్స లేదనుకునేవారు. కానీ ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జర్మనీకి చెందిన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన టిపిఎస్ (ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్) టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని ప్రముఖ న్యూరాలజిస్ట్, సొలేషియం సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ వేముల తెలిపారు. మాదాపూర్లోని సొలేషియం సెంటర్లో ఈ ఆధునిక టెక్నాలజీని జర్మనీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ వేముల మాట్లాడుతూ అల్జీమర్స్, డిమెన్షియా వస్తే చికిత్స లేక బాధపడేవారు. కానీ ఈ నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో మెదడు లోపలికి ఎలాంటి పరికరాలను పంపించకుండానే బయటనుంచే ఈ పరికరంతో మెదడులో దెబ్బతిన్న నరాలను ప్రేరేపించడం (స్టిమ్యులేట్ చేయడం) ద్వారా ఆ నరాలు ప్రేరేపితం కావడంతో కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి రావడం, రోజు వారి కార్యక్రమాల్లో చాలా వరకు బెటర్ అవుతారని తెలిపారు. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సెంటర్లలో ఉపయోగిస్తున్నారని, భారతదేశంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్, హైటెక్ సిటిలోని సోలేషియం సెంటర్లో అందుబాటులోకి తీసువచ్చామని తెలిపారు.

ఈ టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని, ఈ టెక్నాలజీ వల్ల అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతంగా పనిచేస్తుందని ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్లకు, సైక్రియాటిస్ట్లకు ఈ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ, ఈ టెక్నాలజీని కొంతమంది పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు, ఆటిజంతో బాధపడే పిల్లలకు, మతిమరుపుతో బాదపడే వారికి కూడా టిపిఎస్ ఉపయోగపడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *