రెండు స్వర్ణ పతకాలు సాధించిన పాటిబండ్ల నవనీత్
మనవార్తలు ప్రతినిధి,మియాపూర్:
నేపాల్లోని పోఖరాలో ఆగస్టు 17 నుంచి 23, 2026 వరకు నిర్వహించిన తొలి ఇండో–నేపాల్ ఏరోస్కేట్బాల్ ఛాంపియన్షిప్లో మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో నవనీత్ తన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఈవెంట్లో ఒక స్వర్ణ పతకంతో పాటు, వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించి విశేష విజయాన్ని నమోదు చేశాడు.నవనీత్ సాధించిన ఈ ఘన విజయంపై మియాపూర్ కెనరీ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, అతని కృషి, క్రమశిక్షణ, పట్టుదలను అభినందించింది. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.అతని వ్యక్తిగత కోచ్ ఖాదర్ బాషా, స్కూల్ కోచ్ మహేష్ కూడా నవనీత్ను అభినందిస్తూ, అతని క్రీడా ప్రస్థానం మరింత విజయవంతం కావాలని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అంతర్జాతీయ వేదికపై రెండు స్వర్ణ పతకాలు సాధించిన నవనీత్ విజయం అతని కుటుంబానికి, మియాపూర్ కెనరీ స్కూల్కు, కోచ్లకు మరియు తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. యువ క్రీడాకారుడిగా అతను సాధించిన ఈ ఘనత, క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
